Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు దీని బారిన పడినవారే. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజటివ్ వచ్చిన విషయం విదితమే. చికిత్స అనంతరం ఒక్క అభిషేక్ బచ్చన్ మినహా అందరూ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే, దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో డాక్టర్ల నేతృత్వంలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో దర్శకుడు తేజకి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఆయన ముంబయి వెళ్ళారు. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత ఆయనకు పాజిటివ్ రావడంతో డాక్టర్ల సూచన మేరకు చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్తో 'అలువేలు మంగ వేంకటరమణ' చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు.