Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. దీని బారిన పడటానికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదు. పైగా అందరి కంటే ఎక్కువగా వీళ్ళే జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కరోనా బారిన పడటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెలబ్రిటీలు కూడా ఎందుకు కరోనా బారిన పడుతున్నారనే ప్రశ్న కూడా ఆలోచించేలా చేస్తోంది. దీన్ని బట్టి కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఇటీవల దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హౌం క్వారంటైన్లోనే చికిత్స పొందుతున్నారు. అలాగే మరో దర్శకుడు తేజకి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ గత పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయనకి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యుల సలహా మేరకు మంగళవారం నుంచి 15 రోజుల పాటు హాస్పిటల్ క్వారంటైన్లో ఉంటానని సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. అలాగే ప్రముఖ సింగర్ స్మిత, ఆమె భర్తకి సైతం కరోనా బారిన పడ్డారు. తనకి, తనభర్తకి పాజిటివ్ అని తేలిందని, డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా స్మిత తెలిపారు.