Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎస్.బి. చక్రవర్తి ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శోభన్ బాబుతో 'సంపూర్ణ ప్రేమాయణం'(1984), నందమూరి బాలకష్ణ నటించిన 'కత్తుల కొండయ్య', 'నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే 1986లో వచ్చిన 'కాష్మోరా' చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, భానుప్రియ, శరత్బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా భయపెట్టింది. అంతేకాదు అప్పట్లోనే సంచలన విజయం సాధించింది. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించి తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ దర్శకుడు చక్రవర్తి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.