Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగానే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా శృతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాటలతో విశేషంగా అలరించిన శృతి తాజాగా 'ఎడ్జ్' పేరుతో ఓ వీడియో సాంగ్ను ఈనెల 8న విడుదల చేయబోతోంది. దీని గురించి శృతి మాట్లాడుతూ,' అంతర్గత గందరగోళాన్ని, అమితంగా ప్రేమించే వాటిపై అసంపూర్ణత్వాన్ని, అలాగే ఇతరులలో పరిపూర్ణతను చూడటం మానేసినప్పుడు మిమ్మల్ని మీరు నిజంగా అర్థం చేసుకోవడానికి అలాగే అంగీకరించడమనే ప్రయాణం ఆరంభం అవుతుస్త్రసశ్రీఇతివృత్తం' అని తెలిపారు. శృతి ప్రస్తుతం పవన్కళ్యాణ్కి జోడిగా 'వకీల్సాబ్', రవితేజ సరసన 'క్రాక్' చిత్రాల్లో నటిస్తోంది.