Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాయకానాయికలు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ అభిరుచి మేరకు చిత్రాలను నిర్మించాలని, నూతన ప్రతిభను ప్రోత్సహించాలనే సంకల్పంతో సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న విషయం విదితమే. తాజాగా ఈ జాబితాలోకి 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు కూడా చేరారు. ఆయన నిర్మాతగా మారుతూ తొలి ప్రయత్నంగా 'మై బారు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను అగ్రకథానాయకుడు ప్రభాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కష్ణుడు మాట్లాడుతూ,'నా కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికి నచ్చేలా కంప్లీట్ లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ చూశాక సంతప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. శివకుమార్, హర్షిత చౌదరి, వర్షరెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సార్ని పూర్తి చేసుకుంది. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగా నవ్విస్తుంది. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.