Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నింటి కంటే చాలా ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని కథానాయకుడు మహేష్బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 9న మహేష్బాబు పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మహేష్ సోషల్ మీడియా వేదికగా తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి బహిరంగ వేడుకలు జరపవద్దని కోరారు. అలాగే అందరూ ఇంటికే పరిమితమై క్షేమంగా ఉండాలని కూడా కోరారు. ఇదిలాఉంటే, మహేష్బాబు బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ పరిశ్రమ వర్గాలు సైతం కొత్త అప్డేట్ల కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి అప్డేట్ ఇస్తారో మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. మహేష్బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. 'గీతగోవిందం'ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే మరో కథానాయికగా బాలీవుడ్ కథానాయిక అనన్య పాండేని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మహేష్ బర్త్డేకి మరో కొత్త లుక్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.