Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా నుంచి క్షేమంగా బయట పడింది. ఒక్క జయా బచ్చన్కి మినహా అమితాబ్ కుటుంబంలోని అందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గత కొన్ని రోజులుగా వారంతా ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందారు. మొదట ఐశ్వర్యరారు, ఆమె కూతురు ఆరాధ్యలకు కరోనా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత అమితాబ్ సైతం సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చారు. 26 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం అభిషేక్కి కూడా కరోనా నెగటివ్ రావడంతో ఆయన కూడా శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని అమితాబ్ తన ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. 'అభిషేక్ బచ్చన్కు ఈ రోజు టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటికి వచ్చేస్తున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. మా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి ధన్యవాదాలు' అని అమితాబ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.