Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి యావత్ సినీ పరిశ్రమపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. దీని విజృంభణ వల్ల సినిమా చిత్రీకరణలు ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. అయితే ఈ కరోనా కష్టకాలన్ని సైతం పలువురు దర్శక, నిర్మాతలు, కథానాయకులు బాగా ఉపయోగించుకుంటున్నారు. రకరకాల కాంబినేషన్లతో సినిమాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్బాబు, ఎన్టీఆర్తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండగే పండగని వేరే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రుధిరం రణం) పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా, మహేష్బాబు 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది.
ప్లాస్మాని దానం చేయండి : మహేష్బాబు
తన పుట్టినరోజు (ఆదివారం) సందర్భంగా ఎటువంటి సామూహిక వేడుకలను నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసిన మహేష్బాబు తాజాగా ప్రజలకు మరో విజ్ఞప్తి చేశారు. 'నా బర్త్డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దష్టిలో పెట్టుకుంటూ, ఈ ప్లాస్మా డొనేషన్ గురించి ప్రజలకు చెబుతూ, ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న సిపి సజ్జనార్గారి కషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. ప్లాస్మా డొనేట్ చేసి, ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండి' అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.