Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి.బి. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టీివి, సినీ డైరెక్టరీని ప్రచురించడంతోపాటు బుల్లితెర, వెండితెర అవార్డులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీ తారల డైరీని అందించబోతున్నారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫిలిం ఛాంబర్లో జరిగింది. వి.బి. ఎంటర్టైన్మెంట్స్ ఫిిలిం అండ్ టీవి డైరీని బాబు మోహన్ ఆవిష్కరించి తొలికాపీని నటుడు నరేష్కి, మలి కాపీని దర్శకుడు వి.ఎన్.ఆదిత్యకి అందజేసారు. అలాగే త్వరలో జరగబోయే వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ పోస్టర్ను నరేష్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అతిథులంతా నటుడు పొట్టి వీరయ్యను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు ఎస్.ఆర్.ఆర్ ఇన్ఫాస్ట్టక్చర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయం అందజేసారు. వీరితో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో పెంక్షన్ రాని పది మంది పేద కళాకారులకు ఆర్థిక సాయం అందించారు. అలాగే వి.వి.కె హౌసింగ్స్ అధినేత విజయకుమార్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి లక్ష రూపాయల విరాళం ప్రకటించి, చెక్కుని ప్రెసిడెంట్ నరేష్కి అందజేసారు.
ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ,'ఈ సంవత్సరం డైరీని లేడీ డైనమిక్ డైరెక్టర్, గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత దివంగత విజయనిర్మలకు అంకితం ఇవ్వడం, పొట్టి వీరయ్య లాంటి కళాకారుడిని సన్మానించుకోవడం, ఈ కరోనా క్రైసెస్ టైంలో పేద కళారులకు సాయం చేసిన విష్ణు బొప్పనను అభినందిస్తున్నాను' అని చెప్పారు.
'ఈ కరోన సమయంలో కూడా కష్టపడి డైరీని రూపొందించడమే కాకుండా మా అమ్మగారికి అంకితం ఇవ్వడం, సూపర్ స్టార్ కష్ణగారి ఆశీస్సులు పొందడం విష్ణు పట్టుదలకు నిదర్శనం' అని నరేష్ చెప్పారు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ, 'ఈ కరోనా సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తునందుకు రావాలా వద్దా అని సంశయిస్తు వచ్చాను. ఇక్కడికి వచ్చాక అందర్నీ చూసి ఆనందం కలిగింది. మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్న విష్ణుని అభినందిస్తున్నాను' అని తెలిపారు.
'ఈ ఏడాది 2020 డైరీ ఆవిష్కరణ వేడుకని మార్చి నెల 27న ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కాని, కోవిడ్-19 లాక్డౌన్తో వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా, సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఈ వేడుకను ఆదివారం నిర్వహించాం. ఈ వేడుకకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని విష్ణు బొప్పన చెప్పారు.