Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా అలరించిన కథానాయిక కాజల్ రాబోయే చిత్రాల్లో భిన్న పాత్రల్లో కనిపించనుంది. ఇందులో భాగంగా 'మోసగాళ్ళు' చిత్రంలో మంచు విష్ణుకి సోదరిగా నటించింది. అలాగే త్వరలోనే సెట్స్పైకి వెళ్ళబోయే విజరు , ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ సినిమాలోనూ రెండో హీరోయిన్గా నటించేందుకు కాజల్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. వీటితోపాటు బాలీవుడ్లో 'ముంబై సాగా', కోలీవుడ్లో 'ఇండియన్ 2' చిత్రాల్లోనూ భిన్న పాత్రలు పోషిస్తోంది. అలాగే చిరంజీవి సరసన నటించబోయే 'ఆచార్య' చిత్రంలో కూడా కాజల్ పోషించే పాత్ర శక్తివంతంగా ఉండబోతోందని తెలుస్తోంది. పాత్రలు, సినిమాల ఎంపికలో మార్పుకి కారణం ఏంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానమిచ్చింది. 'ఓ నటిగా ఇకపై భిన్నంగా కనిపించాలను కుంటున్నా. అందుకే రొటీన్ పాత్రలకు చెక్ పెట్టేశా' అని కాజల్ తెలిపింది.