Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ అభిమాన కథానాయకుడు మహేష్బాబుకి పుట్టినరోజు కానుకగా ఆయన అభిమానులు జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇవ్వడం విశేషం. 60.2 మిలియన్ల బర్త్డే విషెస్ ట్వీట్లతో తమ అభిమాన కథానాయకుడు మహేష్బాబు పేరుతో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు.అలాగే మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్కి సైతం అద్భుతమైన స్పందన రావడంతో మహేష్బాబు ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. తన పుట్టినరోజుకి అమూల్యమైన గిఫ్ట్ని అందజేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహేష్బాబు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 'ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్కి మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హదయపూర్వక కతజ్ఞతలు. ప్రేమతో మీ మహేష్ బాబు' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
వరల్డ్ రికార్డ్ సష్టించిన మహేష్ బర్త్డే ట్రెండ్
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ అభిమానులు ట్విట్టర్లో 60.2 మిలియన్ ట్వీట్స్తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హాష్టాగ్గా రికార్డ్ సష్టించింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్లో ఈ వరల్డ్ రికార్డ్ సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలను నాటి అభిమానులందరూ ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగం కావాలని మహేష్ పిలుపునిచ్చారు. అలాగే తన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రంలో మహేష్బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలతో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణను ఆరంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.