Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా గత ఐదున్నర నెలలుగా షూటింగ్లు జరగలేదు. కరోనా పరిస్థితులతో సహ జీవనం చేస్తూ టాలీవుడ్ ఇప్పుడిప్పుడే షూటింగ్లతో మళ్లీ కళకళలాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ నటీనటుల దగ్గర్నుంచి లైట్బారు వరకు అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ల్లో పాల్గొంటున్నారు. తాజాగా క్రేజీ కథానాయిక పూజా హెగ్డే కూడా షఉటింగ్లో జాయిన్ అయ్యింది. అఖిల్ సరసన కథానాయికగా నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' చిత్ర షూటింగ్ కోసం పూజా హైదరాబాద్ వచ్చింది. మంగళవారం షూటింగ్లో పాల్గొన్న నేపథ్యంలో కార్వాన్ దగ్గర పీపీపీ కిట్లతో ఉన్న మేకప్మెన్, హెయిర్ స్టయిలీష్తో దిగిన ఫొటోను పూజా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాదు బంధాలు మళ్ళీ దగ్గరయ్యాయి అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. చాలా గ్యాప్ తర్వాత షూటింగ్లోకి అడుగుపెట్టడం ఓ సరికొత్త అనుభూతినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. పూజా ఈ సినిమాతోపాటు ప్రభాస్తో 'రాధేశ్యామ్' చిత్రంలోను, సల్మాన్ఖాన్తో 'కబీ ఈద్ కబీ దివాలి' చిత్రంలోనూ నటిస్తోంది.