Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు రామ్చరణ్ తన అమ్మా నాన్నల కలలను నెరవేర్చే పనిలో బిజీగా ఉన్నారు. తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని నిర్మాతగా రామ్చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. తండ్రి చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ని నిర్మించిన రామ్చరణ్ అమ్మ సురేఖ కోరిక మేరకు చిరంజీవితో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో తానెందుకు నటించాల్సి వచ్చిందో రామ్చరణ్ ఓ ఆంగ్ల మీడియాకి తెలియజేశారు. 'స్టార్ డమ్, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ మా నాన్న వల్ల నాకు వచ్చినవే. అలాంటి ఆయనతో కలిసి సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోవడం నా అదృష్టం. 2015లో నేను నటించిన 'బ్రూస్లీ' చిత్రంలో నాన్న ఓ ప్రత్యేక పాత్రలో నటించి అందరినీ అలరించారు. అలాగే 'ఖైదీనెంబర్ 150'లోని ఓ పాటలో నాన్నతో కలిసి నేను డాన్స్ చేశా. అయితే ఈ రెండు చిత్రాల్లో మా పాత్రల నిడివి చాలా తక్కువగా ఉంటుంది. మేమిద్దం కలిసి పూర్తి స్థాయిలో నటించాలన్నది మా అమ్మ కల. ఆ కలని 'ఆచార్య'తో నెరవేర్చబోతున్నాను. నాన్నతో నా కాంబినేషన్ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో విద్యార్థి నాయకుడిగా రామ్చరణ్ పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుందని, ఆయన సరసన రష్మిక మందన్నా నటించనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.