Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ప్రభావంతో గత ఐదున్నర నెలల కాలంగా సినిమాల షూటింగ్లు లేకపోవడం, థియేటర్లు కూడా ఓపెన్ కాకపోవడంతో కథానాయికలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నిత్యమూ పలు సినిమాల షూటింగ్లతో బిజీ బిజీగా గడిపే హీరోయిన్లు ఒక్కసారిగా ఇంటికే పరిమితమవ్వడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వినోదాన్ని అందించే అతి పెద్ద ప్రత్యామ్నాయ మార్గంగా ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ (ఓటీటీ సంస్థలు) బాగా శక్తిని పుంజుకున్నాయి. అంతేకాదు డిజిటిల్ మీడియాని శాసించే స్థాయికి వచ్చాయి. దీంతో ఓటీటీల కోసం రూపొందే వెబ్ సిరీస్ల్లో నటించేందుకు కథానాయికలు రెడీ అయిపోయారు. ఇప్పటికే బాలీవుడ్లో పలువురు హీరోయిన్లు వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే సమంత, సాయిపల్లవి వంటి తదితర కథానాయికలు సైతం వెబ్ సిరీస్ల్లో మెరవబోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో అగ్రకథానాయిక తమన్నా చేరింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించబోయే ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు తమన్నా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న పోటీ, వేగం వంటి తదితర అంశాల నేపథ్యంలో థ్రిల్లర్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఈ సిరీస్లో తమన్నా మోడ్రన్ కార్పొరేట్ గర్లగా భిన్న మైన పాత్రను పోషించనుందట. తమన్నా ప్రస్తుతం గోపీచంద్తో 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.