Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొన్ని నెలలుగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' చిత్రం థియేటర్లకు బదులగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతుందంటూ పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశాయి. చిత్ర బృందం కూడా చాలా సార్లు థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ అధికారిక ప్రకటనలూ చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నట్టు శుక్రవారం అఫీషియల్గా ఎనౌన్స్ చేసింది. అలాగే కథానాయిక అనుష్క సైతం 'నీ సైలెన్సే నిన్ను కాపాడుతుంది' అనే మెసేజ్తోపాటు ఈ చిత్ర ప్రోమోను ఇన్స్టా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. అనుష్కతోపాటు మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, మైఖేల్ హడ్సన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. 'నేను ఇప్పటివరకు పోషించిన అన్ని పాత్రలతో పోలిస్తే సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతేకాదు నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు నెట్టేసిన పాత్ర కూడా' అని కథానాయిక అనుష్క తెలిపారు.