Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డ్రీమ్' చిత్ర దర్శకుడు భవాని శంకర్ తాజాగా రూపొందించిన పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్ 'క్లైమాక్స్'. ఈ చిత్ర మోషన్ పోస్టర్ని సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రఖ్యాత వ్యాపారవేత్తగా రాజేంద్రప్రసాద్ కనిపిస్తుండగా, పథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్, శ్రీరెడ్డితో పాటు సాషా సింగ్, రమేష్, చందు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'దర్శకుడు భవాని శంకర్తో 'డ్రీమ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్లో పని చేసాను. ఆ చిత్రానికి రాయల్ రీల్ అనే అనే ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కానీ అది ఒక జానర్ ప్రేక్షకులకి మాత్రమే నచ్చిందని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా అన్ని వచ్చేలా మల్టీ జానర్ కథతో వస్తున్నాం. ఇవన్నీ ఒకే కథలో ఎలా వస్తాయి అని మీరనుకుంటుంటే, కచ్చితంగా 'క్లైమాక్స్' చూడాల్సిందే' అని చెప్పారు.'చిత్రీకరణ పూర్తయి విడుదలకి సిద్ధంగా ఉన్న మా చిత్రంలో సీనియర్ హీరో డా. రాజేంద్రప్రసాద్ సహా మిగతా పాత్రలు చాలా థ్రిల్లింగ్గాను, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మొదటిసారి ఒక మల్టి జానర్ చిత్రంతో రాబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని దర్శకుడు భవాని శంకర్ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, 'మా చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఎన్నో ఉత్కంఠభరిత కథనాలతో తెరకెక్కిన మా చిత్రం మోషన్ పోస్టర్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మల్టి జానర్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని మాకు నమ్మకముంది' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ నిధివన, కెమెరా: రవికుమార్ నీర్ల, కొరియోగ్రఫీ: ప్రేమ్రక్షిత్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, ఆర్ట్: రాజ్కుమార్.