Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శైలజాకష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'మిస్ మ్యాచ్' వంటి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కథానాయిక ఐశ్వర్య రాజేష్. నాని హీరోగా రూపొందుతున్న 'టక్ జగదీష్'లోనూ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తాజాగా ఓ తమిళ సెన్సేషనల్ రీమేక్లో నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చారు. కె.భాగ్యరాజా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ముందానై ముడిచ్చు' (1983). దీన్ని తెలుగులో 'మూడు ముళ్లు' పేరుతో రీమేక్ చేశారు. 37 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ సినిమాకి రీమేక్ రూపొందనుంది. 'అనంతపురం' ఫేమ్ శశికుమార్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించబోతున్నారు. రీమేక్ కి నాటి హీరో, దర్శకుడు కె.భాగ్యరాజా కథ, స్క్ర్రీన్ప్లే అందిస్తుండటం విశేషం. ''ముందానై ముడిచ్చు' రీమేక్లో నటిస్తుండటం తనకెంతో ఎగ్జయిటింగ్గా ఉందని, ఓ ల్యాండ్ మార్క్ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్యారాజేశ్ ట్వీట్ చేశారు.