Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తని ఒరువన్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తర్వాత 'జయం' రవి, అరవింద్ స్వామి కాంబినేషన్లో రూపొంది సంచలన విజయం సాధించిన మరో చిత్రం 'బోగన్'. యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని లక్ష్మణ్ డైరెక్ట్ చేశారు. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా తమిళంలో ఏకంగా రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే టైటిల్తో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా విశేషాల గురించి నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, 'ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసాఫీసర్ విక్రమ్ కథే 'బోగన్' చిత్రం. తనకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆదిత్యను ఒక అద్భుత ప్లాన్తో విక్రమ్ పట్టుకోవడం టెర్రిఫిక్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ తర్వాత సాగే కథ కూడా ప్రేక్షకులు ఊహించని మలుపులు తిరిగి, అనుక్షణం ఉత్కంఠభరితంగా కథనం పరుగులు పెడుతుంది. విక్రమ్ ఐపీఎస్గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి ఫెంటాస్టిక్గా నటించిన ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 'తని ఒరువన్' సినిమాలో మాదిరిగానే వీరిద్దరి పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. అంతేకాదు ప్రేక్షకులను అనుక్షణం థ్రిల్ చేస్తూ ఉంటాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే తమిళనాట ఘన విజయం సాధించింది. అలాగే తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. హీరోయిన్గా హన్సిక మొత్వాని నటించిన ఈ చిత్రంలో నాజర్, పొన్వణ్ణన్, నరేన్, అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ నెల 26న చిత్రం ట్రైలర్ని విడుదల చేస్తాం. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంభాషణలు: రాజేష్ ఎ.మూర్తి, సాహిత్యం: భువనచంద్ర, గాయనీ గాయకులు: సమీర భరద్వాజ్, శ్రీనివాసమూర్తి, సాయినాథ్, అశ్విన్, దీపిక, సంగీతం: డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన,్ దర్శకత్వం: లక్ష్మణ్, నిర్మాత: రామ్ తాళ్లూరి.