Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1978లో 'పునాది రాళ్ళు' చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ఆరంభించిన చిరంజీవి నేటితో (మంగళవారం)తో దిగ్విజయంగా 42 సంవత్సరాలను పూర్తి చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 'బాస్ ఇన్ టాలీవుడ్' పేరుతో ఓ కామన్ డిస్ ప్లే పిక్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా భిన్న పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు చిరంజీవి. ఇక ఆయన డాన్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. తనదైన మార్క్ యాక్టింగ్, డాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసి మెగాస్టార్గా ఎదిగారు. 42 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 150 చిత్రాల్లో చిరు నటించారు. ప్రస్తుతం 151వ సినిమా 'ఆచార్య' కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి తనయుడు రామ్చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.
- బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణను సోమవారం మొదలు పెట్టారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రమణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.