Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట కథానాయిక అనుష్కకి మంచి క్రేజ్ ఉంది. పలు వైవిధ్యమైన మహిళా ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించి హీరోలకు దీటుగా రాణించింది. స్టార్ హీరోల మాదిరిగానే అనుష్క సినిమాల కోసం ప్రేక్షకులందరూ ఎదురు చూడ్డం విశేషం. అనుష్క తాజాగా నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. తెలుగుతోపాటు ఇంగ్లీష్, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రోజు రోజుకి కరోనా విజృంభిస్తుండటంతో థియేటర్ల ఓపెనింగ్పై స్పష్లత రాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా ఈచిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈచిత్ర ట్రైలర్ను అమెజాన్ ప్రైమ్ సంస్థ విడుదల చేసింది. ఇందులో అనుష్క సాక్షి అనే మూగ అమ్మాయిగా నటించింది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మాడ్సన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. సోనాలి అనే యువతి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి?, సాక్షి (అనుష్క), ఆంటోని (మాధవన్)లు ఎవరు?, వీళ్ళకి సోనాలికి ఉన్న సంబంధం ఏమిటి? వంటి తదితర అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.