Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్త్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం కథానాయకుడు కార్తికేయ బర్త్డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా జిఏ2 పిక్చర్స్ సంస్థ 'చావు కబురు చల్లగా' ఫస్ట్ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది. 'కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఫస్ట్ గ్లింప్స్ ఉందంటూ ప్రశంసలు లభించాయి. ఆమని, భద్రం ల డైలాగ్స్ కూడా సామాన్య ప్రేక్షకులకి చాలా దగ్గరగా ఉండటం, విజువల్స్ చాలా క్యూట్గా ఉండటం అందర్ని ఎట్రాక్ట్ చేసింది. అంతేకాదు బన్నివాసు, జిఏ2 పిక్చర్స్ స్టాండర్స్ మరొక్కసారి నిరూపించేలా ఉండటం విశేషం' అని చిత్ర బృందం తెలిపింది.
నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ, 'జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో 'భలేభలే మగాడివోరు', 'గీతాగోవిందం', 'ప్రతిరోజు పండగే' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అలాంటి బ్యానర్లో వచ్చే ప్రతి చిత్రం పై ప్రేక్షకులకి అంచనాలు ఉంటాయి. వాటిని దష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. మేం అనుకున్న దానికంటే కార్తికేయ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని వీడియోలోని విజువల్స్ చూస్తేనే మీకు అర్ధమవుతుంది. కార్తికేయ డేడికేషన్ వల్లే మా అవుట్పుట్ అంత అందంగా వచ్చింది. దర్శకుడు కౌశిక్ కొత్తవాడయినా చాలా టాలెంట్ ఉన్నవాడు. తను చెప్పిన కథ చాలా ఫ్రెష్గా అనిపించి రాజీపడకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సర్ప్రైజ్లు త్వరలో వస్తాయి' అని తెలిపారు.