Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా విడుదలైన సంచలన విజయం సాధించిన చిత్రం 'భాగమతి'. ఈ చిత్రాన్ని భూమి పడ్నేకర్ కథానాయికగా 'దుర్గావతి' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఈ రీమేక్కి కూడా మాతృక దర్శకుడు అశోక్ దర్శకత్వం వహించారు. భూమి పడ్నేకర్తో పాటు జిషు సేన్గుప్తా, అర్షద్ వాసి, మహి గిల్ తదతరులు నటిస్తున్న ఈచిత్రాన్ని బాలీవుడ్ స్టార్ అక్షరుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్పై, టీ- సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో కలిసి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నారు. భారీ ఆఫర్తో ఈ చిత్ర రిలీజ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, భూమి పడ్నేకర్ నటించిన 'లస్ట్ స్టోరీస్' యాథాలజీ, 'డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే' చిత్రం కూడా ఓటీటీలోనే విడుదలయ్యాయి. లేటెస్ట్గా 'దుర్గావతి' కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.