Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు చెన్నై ఎంజిఎం ఆస్పత్రి వర్గాలు గురువారం సాయంత్రం ఓ హెల్త్ బులిటెన్ని విడుదల చేశాయి. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితిలో పెను మార్పులు సంభవించాయని వైద్యుల బృందం ఆ బులిటెన్లో తెలిపింది. కరోనా పాజిటివ్ ఉన్న కారణంగా ఎస్.పి.బాలు ఆగస్ట్ 5వ తేదీన ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్తో కొన్ని రోజులు పోరాడిన తర్వాత నెగటివ్ అని తేలినప్పటికీ ఆయనకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని, లైఫ్ సపోర్ట్ సహాయంతో ఆయనకు నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స చేస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలు ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందనే వార్త వినగానే అగ్ర నటుడు కమల్హాసన్ ఆస్పత్రికి వెళ్లి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇలాంటి విషమ పరిస్థితి నుంచి బాలు కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అందరూ ఆకాంక్షిస్తూ పోస్ట్లు పెడుతున్నారు.