Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వాయిదా పడింది. నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో 51వ చలన చిత్రోత్సవం జరగాల్సి ఉంది. అయితే ఈ చలన చిత్రోత్సవాన్ని వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24వ తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో ప్రకాశ్ జావడేకర్ చర్చించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే ఇఫీ హైబ్రిడ్ పద్ధతిలో అంటే వర్చువుల్, ఫిజికల్గానూ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. 51వ చలన చిత్రోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.