Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సీనియర్ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం రాత్రి కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో గత 22 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆయన వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా నెగటివ్ అని తేలినప్పటికీ ఆయన కోలుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేశారు.
గత 27 సంవత్సరాలుగా ఎన్నో చిత్రాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించిన 'తెగింపు' చిత్రంతో వెండితెరకు కోసూరి పరిచయం అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మర్యాద రామన్న' చిత్రంతోపాటు 'పిల్ల జమీందారు', 'విక్రమార్కుడు', 'అమీతుమీ', 'ఛలో'
వంటి తదితర సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. వైవిధ్యమైన పాత్రలతో ముఖ్యంగా కామెడీతో ప్రేక్షకులను అలరించిన కోసూరి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.