Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘామ్ష్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'కోతి కొమ్మచ్చి'. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ మంచి కథతో, ఇద్దరు హీరోలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ, 'యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న మా చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునేలా అనూప్ పాటలు సమకూరుస్తూ, కథకు తగ్గట్టుగా మంచి ఆల్బం ఇచ్చేందుకు కషి చేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం'అని తెలిపారు. 'సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ నుండి చిత్రీకరణ మొదలు పెడతాం. ఈ సినిమా కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉంది. దీనికి అనూప్ నూటికి నూరుపాళ్ళు యాప్ట్. ఆయన నేతృత్వంలో మంచి ఆల్బమ్ వస్తుందని ఆశిస్తున్నాం' అని నిర్మాత ఎం.ఎల్.వి.సత్యానారాయణ చెప్పారు.