Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ టైటిల్ పాత్రధారిగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మేజర్'. సల్మాన్ ఖాన్ సరసన 'దబాంగ్ 3'లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సయీ మంజ్రేకర్ (నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తనయ) ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపికయ్యారు. వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొననున్నారు. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ క్యారెక్టర్ను అడివి శేష్ పోషిస్తోండగా, 'గూఢచారి' ఫేమ్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రను చేస్తున్నారు. ఇప్పటివరకు 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. 'మేజర్' చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, మహేష్బాబు సొంత నిర్మాణ సంస్థ ఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్ స్పెషల్గా ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.