Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం 'సైకోవర్మ' (వీడు తేడా ఉప శీర్షిక). కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నట్టికుమార్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయనే దర్శకత్వం వహిస్తున్న 'డిఎస్జె' (దెయ్యంతో సహజీవనం) సినిమా లోకేషన్లో శనివారం హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అలాగే గాన గంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టుకుమార్ మాట్లాడుతూ,'ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తీస్తున్న చిత్రం 'సైకో వర్మ'. చిత్రీకరణ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సినిమా బాగొచ్చింది. కరోనా టైంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేశాం. మా అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు. నేను అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఎల్లప్పుడూ కావాలి. రీసెంట్గా రిలీజ్ చేసిన 30 సెకన్ల టీజర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే పాటను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీంతో పాటు మరో ఐదారు సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి' అన్నారు. 'కొంచెం టెన్షన్ పడినప్పటికీ చిత్రీకరణ బాగా చేస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి' అని హీరో నట్టి క్రాంతి అన్నారు. 'బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండటం వల్ల మా బ్రదర్ బర్త్ డే వేడుకలు ఇంకా బాగా చేయలేకపోతున్నాం. సైకోవర్మ అవుట్ఫుట్ బాగా వచ్చింది' అని నిర్మాత నట్టి కరుణ తెలిపారు.