Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ సమర్పణలో, పెదరావురు ఫిల్మ్ సిటీ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం 'యూత్'. 'కుర్రాళ్ళ గుండె చప్పుడు' అనేది ట్యాగ్లైన్. అలీతో 'పండుగాడి ఫొటో స్టూడియో' వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు దిలీప్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
'లాక్డౌన్ కారణంగా మార్చిలో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ మళ్ళీ గోవాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తొమ్మిది రోజులు గోవాలోనే జరుగతుంది. రెండవ షెడ్యూల్ నవంబర్ 9 నుంచి రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరిస్తాం. జనవరిలో చివరి షెడ్యూల్, క్లైమాక్స్ సన్నివేశాలను ఏపీలోని 13 జిల్లాలలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నావం. 2021 ఏప్రిల్కు సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆ సమయానికి కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని, తిరిగి థియేటర్లకు ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా వస్తారని ఆశిస్తున్నాం. గోవాలో చేస్తున్న షెడ్యూల్లో బీచ్ దగ్గర కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు, అలాగే చిత్రంలోని కీలక సంఘటనలను చిత్రీకరించబోతున్నాం. ఈ సినిమా కథను, అలాగే ఇందులో నటించే నటీనటుల వివరాలను ప్రస్తుతానికి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నాం. నవంబర్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ వివరాలను తెలియజేస్తాం. ఈ సినిమాతోపాటు 'తను నేనూ ఒక్కటే' అనే టైటిల్తో కూడా ఓ చిత్రం రూపొందించబోతున్నాం. ఈ టైటిల్కు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి వచ్చింది. 2021లో ఈ చిత్రం మొదలవుతుంది' అని దర్శకుడు దిలీజ్ రాజా తెలిపారు.