Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'దీర్ఘాయుష్మాన్ భవ'. ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'కొంచెం కొంచెం' అంటూ సాగే పల్లవిగల పాటను ప్రముఖ దర్శకుడు సాగర్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ, 'మా సినిమా ఫస్ట్ సాంగ్ను డైరెక్టర్ సాగర్గారు విడుదల చేయటం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇదొక సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రమ్. చాలా రోజుల తర్వాత యముడుగా కైకాల సత్యనారాయణ ఈ చిత్రంతో మరోమారు ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని చెప్పారు.
'మా చిత్ర ఫస్ట్ సాంగ్ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు సాగర్ గారికి కతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచింది 'కొంచెం.. కొంచెం' అంటూ ఈ సాంగ్ కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి బాగా నటించారు. డైరెక్టర్ పూర్ణానంద్ గారు సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది' అని నిర్మాత ప్రతిమ.జి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ,'సంగీతానికి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. మా సినిమా ఫస్ట్ సాంగ్ 'కొంచెం కొంచెం'ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా దర్శకుడు సాగర్గారు రిలీజ్ చెయ్యడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని అన్ని పాటలు సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పూర్ణ, నిర్మాత ప్రతిమగారికి కతజ్ఞతలు' అని అన్నారు.
'ఓ మంచి సినిమాలో హీరోగా నటించే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. వాటితో పోలిస్తే చాలా భిన్నమైన ప్రేమకథా చిత్రమిది. ఇందులో హీరోయిన్గా మిస్తి చాలా అద్భుతగా నటించింది' అని హీరో కార్తీక్ రాజు చెప్పారు. పథ్వీరాజ్, సత్యం రాజేష్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, కెమెరా: మల్హర్భట్ జోషి, మాటలు: ప్రదీప్ ఆచార్య, పూర్ణానంద్.ఎం, ఆర్ట్: రామకష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్.ఎం.