Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ నాయకానాయికలుగా నటించిన చిత్రం 'బాలా' చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. బెర్లిన్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండో జర్మన్ ఫిల్మ్ వీక్లో ఈ చిత్రాన్ని ఆదివారం ప్రదర్శించారు. ఇండో జర్మన్ ఫిల్మ్వీక్లో ప్రదర్శితమైన ఏకైక బాలీవుడ్ చిత్రం ఇదే కావడం విశేషం. 'మా చిత్రాన్ని ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారని ఊహించలేదు. ఓ సున్నితమైన సమస్యతో బాధపడుతున్న మగాళ్లందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాం' అని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. అమర్ కౌషిక్ దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ సినిమా మంచి విశేష ఆదరణ పొందింది. అలాగే వసూళ్ళ పరంగానూ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర శభాష్ అనిపించుకుంది. ఓ సున్నితమైన సమస్యతో తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలనూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పురుషులకు ఉన్న అతి పెద్ద సమస్య బట్టతల. దీని వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఓ బట్టతల ఉన్న యువకుడిగా ద్వారా ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో బట్టతల యువకుడిగా నటించిన ఆయుష్మాన్ ఖురానా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇండో జర్మన్ ఫిల్మ్వీక్ ప్రారంభోత్సవ చిత్రంగా ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన 'పరీక్ష' చిత్రాన్ని ప్రదర్శించారు. తన కొడుక్కి మంచి విద్యని అందించడం కోసం బీహార్కి చెందిన ఓ రిక్షా కార్మికుడు ఎలాంటి పోరాటం చేశాడనే నేపథ్యంలో 'పరీక్ష' చిత్రం రూపొందింది.