Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో 'పుష్ప' పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. దీని తర్వాత విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియాని రూపొందించబోతున్నారు. ఈ సినిమాని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మాత కేదార్ సెలగంశెట్టి నిర్మిస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ని ఎనౌన్స్ చేశారు. 2022లో మొదలు కాబోయే ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా, సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబోలో ప్రేక్షకులు ఆశించే కొత్తదనంతో ఉంటుందని నిర్మాత చెప్పారు.