Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో వైభవంగా జరిగాయి. తెలంగాణ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా, జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సారధ్యంలో ఘనంగా జరిగిన పైడి జయరాజ్ జయంతోత్సవంలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మనవడు ఎన్.వి.సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, బాబు మోహన్, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు మోహన్ గౌడ్, పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని పైడి జయరాజ్కి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,'భారతీయ సినిమాకు పైడి జయరాజ్ అందించిన సేవలకు తగ్గట్టుగా ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారు మోగేలా నా వంతు కషి చేస్తాను' అని తెలిపారు. తెలంగాణాలో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలని, అలాగే హైదరాబాద్-కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలని పంజాల జైహింద్ గౌడ్ కోరారు.