Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదున్నర దశాబ్దాలుగా అత్యద్భుత గానంతో అందరినీ అలరించిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్ రూబెన్స్, రవివర్మ, శ్రీకాంత్, వేణు, మణి- నాగరాజ్, బల్లేపల్లి మోహన్, రవిశంకర్, ఎం.వి.కె.మల్లిక్, శివరామ్ వింజమూరి, కె.ఎం.రాధాకష్ణ,- ఎస్.ఏ.ఖుద్ధూస్, వెంగీ సుధాకర్, మాధవి తదితరులు పాల్గొని బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. వారిలో కె.రాఘవేంద్రరావు, మాధవపెద్ది సురేష్, మనో, రామాచారి, కోటి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రీరామచంద్ర, వినోద్ బాబు, పార్థసారథి, శారదాసాయి, వి.కనకదుర్గ, శ్రీకష్ణ, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.