Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. దసరా కానుకగా ఈనెల 23న ఈ చిత్ర మోషన్ పోస్టర్ని 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో రిలీజ్ చేేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ లేటెస్ట్ అప్డేట్తో ప్రభాస్ అభిమానులతోపాటు పరిశ్రమ వర్గాలూ ఆనందం వ్యక్తం చేశాయి. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే, పూజా హెగ్డే బర్త్డే సందర్భంగా అమె పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన లుక్ అందరినీ బాగా అలరించింది. అలాగే టైటిల్ ఎనౌన్స్మెంట్తో విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్ సైతం అందరిలోనూ క్యూరియాసిటీ పెంచింది. 'ప్రభాస్ పుట్టిన సందర్భంగా 'రాధేశ్యామ్' ఫస్ట్ మోషన్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం. వాళ్లు మిమ్మల్ని తప్పకుండా మరోసారి ప్రేమలో పడేలా చేస్తారు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ ఈనెల 23న రిలీజ్ చేస్తున్నాం' అని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు.