Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి తరం సావిత్రిగా ప్రేక్షకులు, విమర్శకుల పొందిన కథానాయిక కీర్తి సురేష్. 'మహానటి' సినిమాలోని నటనతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా సుపరిచితురాలైంది. శనివారం కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కీర్తి నటిస్తున్న తాజా చిత్రాల్లోని లుక్స్ విడుదలయ్యాయి. మహేష్బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో కీర్తి నాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం 'మిస్ ఇండియా'. అలాగే నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుడ్లక్ సఖీ'లోనూ కీర్తి నటిస్తోంది. ఈ సినిమాలకు సంబంధించి విడుదలైన కీర్తి పోస్టర్లు వేటికవే భిన్నంగా ఉంటూ అందరినీ అలరించాయి. అలాగే 'గుడ్లక్ సఖీ' చిత్ర బృందం కీర్తి బర్త్డే స్పెషల్గా ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో సైతం ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం విశేషం. 'మీ ప్రేమ అభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. మీ ప్రేమకు మరోసారి థ్యాంక్స్' అంటూ కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.