Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా, ప్రతినాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్కుమార్ ఇకపై దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆమె దర్శకత్వంలో తెన్నాండాల్ ఫిలింస్ పతాకంపై రామస్వామి నిర్మాతగా 'కన్నామూచి' (దాగుడు మూతలు) అనే చిత్రం తెరకెక్కుతోంది. మహిళా సాధికారతను తెలిపేలా, 'ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది. మనకు వారు తెలుసు, మనలోనే వారుండొచ్చు అలాంటి వారి గురించి బలంగా చెబుతాం' అంటూ ఈ సినిమా టైటిల్ పోస్టర్ను సమంత, ఐశ్వర్యా రాజేష్, సాయిపల్లవి, రాధికా శరత్కుమార్, జ్యోతిక, కీర్తిసురేష్, మంజిమ మోహన్, కాజల్ అగర్వాల్, రెజీనా కసండ్ర, శ్రద్ధా శ్రీనాథ్, అదితిరావు హైదరి, హన్సిక, సుహాసిని, సిమ్రాన్, చిన్మయి, త్రిష, అక్షరా హాసన్, ఆండ్రియా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సయేషా సైగల్, శతిహాసన్, తాప్సీ, లక్ష్మీమంచు తదితరులు వారి ట్విట్టర్లో షేర్ చేస్తూ వరలక్ష్మి శరత్కుమార్కు అభినందనలు తెలిపారు. వరలక్ష్మి శరత్కుమార్ ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.