Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ స్వీయదర్శకత్వంలో ఆరంభమైన 'నర్తనశాల' సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం విదితమే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్బాబు నటించారు. అప్పట్లో చిత్రీకరించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్.బి.కె థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా ఈనెల 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్కి ఉపయోగించడానికి బాలకష్ణ సంకల్పించడం విశేషం. ఈ సినిమా కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నందమూరి అభిమానులు, ప్రేక్షకులకు నెరవేరబోతోంది.