Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. 'భూమిక' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ థ్రిల్లర్ ఐశ్వర్య రాజేశ్కి 25వ సినిమా కావడం విశేషం. అగ్ర కథానాయిక తమన్నా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
గతంలో ఈ బ్యానర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్ నటించిన 'పెంగ్విన్' చిత్రం విడుదలైంది. కార్తికేయన్ సంతానమ్, సుధాన్ సుందరమ్, జయరామన్ ఈ సినిమాకి నిర్మాతలు. రతీంద్రన్.ఆర్. ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఆసక్తికర పాయింట్తో ప్రేక్షకుల్ని ఆద్యంతం థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత సుధాన్ సుందరమ్ తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామన్నారు.