Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంచభూత క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం 'సారథి'. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో ఒక షెడ్యూల్ మినహా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోగా నందమూరి తారక రత్న, హీరోయిన్గా కోన శశిత నటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ, 'గతంలో ఖోఖో నేపథ్యంలో 'రథేరా' నిర్మించాం. జనవరిలో విడుదలైన ఆ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాని చూసి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి నాన్న, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఆ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారక రత్నతో ఈ సినిమా తీస్తున్నాం. ఇందులో తారక రత్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరించాలి. ఈ చిత్రం ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవల కడపలో తీసిన షెడ్యూల్తో సినిమా ప్రధాన చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. ఇంకో షెడ్యూల్ మిగిలి ఉంది. కరోనా సమయంలో కూడా తారక రత్న ఎంతో సాహసంతో షెడ్యూల్ను పూర్తి చేసి సహకరించారు. ఆయనకు చిత్ర టెక్నీషియన్ల బందం ఎంతో ఋణ పడి ఉంది. త్వరలోనే మిగతా చిత్రీకరణ పూర్తి చేసి మీ ముందుకు వస్తాం' అని తెలిపారు. సిద్దేశ్వర రావు, కష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ, జబీర్ వెంకట్, ఫరీద్, దేవా, జై, మునీస, మధు, జమాల్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరామెన్: మనోహర్ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్: సిద్ధార్థ వాటికన్, మేకప్: శ్యామ్, స్టంట్స్: కష్ణ మాస్టర్, డాన్స్ మాస్టర్: హరి జాను, సోముజి, డిటిఎస్: పద్మారావు, ఎడిటింగ్: విజన్ స్టూడియో, ప్రొడ్యూసర్స్: నరేష్ యాదవ్. పి., వై.ఎస్.కష్ణమూర్తి, పి సిద్దేశ్వర రావు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జాకట రమేష్.