Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేరాఫ్ ఆఫ్ కంచెరపాలెం' ఫేమ్ కార్త్తీక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్గా శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'లింగోచ్చా' (గేమ్ ఆఫ్ లవ్). ఆనంద్ బడా దర్శకత్వంలో నిర్మాత యాదగిరి రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా విజయ దశమి కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సందర్బంగా నిర్మాత యాదగిరి రాజు మాట్లాడుతూ,' లింగోచ్చా' నేపథ్యంలో ఆనంద్ బడా చెప్పిన కథ బాగా నచ్చింది. అలాగే ఈ కథకి హీరో కార్త్తీక్ రత్నం సరిగ్గా సరిపోయాడు. అతని ఎనర్జి మా సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ చిత్రంలో చేసిన హీరోయిన్ సుప్యార్ధ్ సింగ్, 'అదిరింది' షో సద్దాం, 'పటాస్' బల్వీర్ సింగ్ ఇలా.. అందరూ చాలా నేచురల్గా నటించి మెప్పించారు. ఈ టీజర్ని విజయదశమి కానుకగా హీరో విశ్వక్ సేన్ విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఈ టీజర్ తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. 'మా నిర్మాత యాదగిరి రాజు ఈ చిత్ర కథని నమ్మి నిర్మించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని యదార్ధ సంఘటనలు ఇచ్చిన స్పూర్తితో ఈ కధని రాసుకున్నాను. 'లింగోచ్చా' అని చెప్పినప్పుడు చాలా మంది అదేంటి అని వింతగా అని అడిగారు. కానీ దాని అర్ధం తెలిసాక అందరూ బావుంది అని చెప్పారు. ఇంతకీ లింగోచ్చా అంటే ఏడు పెంకులాట, లాగోరి, పిటో, సెవెన్ స్టోన్స్ అని ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆడతారు. అలాంటి ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాతకి ధన్యవాదాలు. కొన్ని చిత్రాలు ఎంత బాగున్నా థియేటర్ బయటకి రాగానే మర్చిపోతాం. కాని ఈ సినిమా మెమరీస్ని మీ ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇది మా యూనిట్ అందరి నమ్మకం' అని ఆనంద్ బడా చెప్పారు.