Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఫస్ట్ ఫ్రే˜మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి బాబా 'జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిన్నటితో ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. మంచి కథ, కథనాలతో ఫారెస్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. నలబై రోజుల్లో అనుకున్న చిత్రీకరణను పర్ఫెక్ట్ ప్లానింగ్, నటీ నటులు, టెక్నీషియన్స్ సహకారంతో 35 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. బ్యాలెన్స్ ఉన్న పాటని తొందరలోనే చిత్రీకరించనున్నారు. కోవిడ్ -19 ప్రభావం లాక్డౌన్ ఉన్న సమయంతోపాటు, మరో పక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈ చిత్రాన్ని ఒక ఫారెస్ట్లో వర్షాలను సైతం లెక్క చేయకుండా చిత్రీకరణ చేయడం అంటే మాములు విషయం కాదు. ఎంతో ధైర్య సాహసాలతో ముప్పై ఐదు రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసిన ఈ టీమ్ని అభినందించాలి. పంజా వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్ కానుంది. అలాగే జ్ఞ్యానశేకర్ బాబా అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి' అని చిత్ర బృందం తెలిపింది.