Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠి మల్లికగా 'చావుకబురు చల్లగా' చిత్రంలో కనిపించనుంది. 'అందాల రాక్షసి' చిత్రంలో పక్కింటి అమ్మాయిలా అందర్ని తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పడు మల్లికగా మెదటి లుక్లోనే అందరికి దగ్గరయ్యింది. ఇప్పడు మల్లిక మన బస్తి బాలరాజుతో జోడి కట్టేసింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా 'చావు కబురు చల్లగా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మల్లికగా చాలా నేచురల్గా ఉన్న లావణ్య త్రిపాఠి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా అంతే నేచురల్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చితత్రానికి జకీస్ బీజారు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ,' జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో 'భలేభలే మగాడివోయ్', 'గీతాగోవిందం', 'ప్రతిరోజు పండగే' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అలాంటి బ్యానర్లో వచ్చే ప్రతి చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గత చిత్రాలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. అందుకే బస్తిబాలరాజుగా టీజర్లో చూపించాం. అలానే ఇప్పుడు లావణ్య త్రిపాఠిని మల్లికగా పరిచయం చేశాం. మా మల్లిక పోస్టర్ చూసిన వారంతా చాలా బాగుందని ప్రశంశిస్తున్నారు. తన పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. రెగ్యులర్ సినిమా కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.