Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా ఇండిస్టీలో 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ, గత ఏడేళ్ళుగా డిఓపిగా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్ దసరా పర్వదినాన సప్త స్వర క్రియేషన్స్ సంస్థను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'చెడుపై మంచి సాధించిన రోజు దసరా. ఈ శుభ నేపథ్యంలో మా బ్యానర్ను స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులను అలరించే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్తో పాటు యూత్ని ఎట్రాక్ట్ చేసే ప్రేమ కథా చిత్రాలు, అలాగే ఇంటిల్లి పాది చూసే కుటుంబ కథా చిత్రాలు నిర్మించాలన్నదే మా సంస్థ సంకల్పం. ఏడాదికి 4 సినిమాలు నిర్మించాలనే కత నిశ్చయంతో ఉన్నాం. అలాగే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయగల సినిమాలకు రూపకల్పన చేయగల టాలెంట్ ఉన్న నటీనటులకు, టెక్నీషియన్స్కు అవకాశం కల్పించడం మా ప్రధాన ఉద్దేశ్యం. మా సంస్థ చేపట్టబోయే ప్రాజెక్ట్స్ల వివరాలను త్వరలో తెలియ చేస్తాం' అని తెలిపారు.