Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'కోతి కొమ్మచ్చి'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్రాజు తొలిషాట్కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ, 'యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ ఇది. నవంబర్ 3 నుండి అమలాపురంలో చిత్రీకరణ మొదలు పెడతాం. ఆ తర్వాత వైజాగ్లో కొంత పార్ట్ని చిత్రీకరిస్తాం. ఒకే షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం' అని తెలిపారు. 'సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ మా బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘాంశ్ శ్రీహరి, సమీర్లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాం' అని నిర్మాత ఎం.ఎల్.వి. సత్యానారాయణ చెప్పారు. 'త్వరలోనే చిత్రీకరణలో పాల్గొన బోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం' అని కథానాయకులు మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న ఆకాక్షించారు. రిద్ది కుమార్, మేఘా చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.