Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా, ఆయుషి హీరోయిన్గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ చిత్రం దసరా పర్వదినాన సారధి స్టూడియోస్లో ఘనంగా ప్రారంభం అయ్యింది. పూజ అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి క్లాప్ ఇవ్వగా, కె.ఎస్.రవి కుమార్ చౌదరి కెమెరా స్విచాన్ చేశారు.అనంతరం పాత్రికేయులతో దర్శకుడు డి.ఎస్.రాథోడ్ మాట్లాడుతూ,'ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న మదర్ సెంటిమెంట్ సినిమా. కథ చాలా బాగా వచ్చింది. గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ టాలెంట్ చూసి మా సినిమాకి సరిపోతాడని హీరోగా ఎంపిక చేసుకున్నాం. నవంబర్ 8 నుంచి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభిస్తాం. తాండూరులో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, నవంబర్ చివరి వారంలో రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో జరుపుకుంటాం. పాటల కోసం బ్యాంకాక్ వెళ్తున్నాం' అని తెలిపారు.హీరోయిన్ ఆయుషి మాట్లాడుతూ,' కథ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని తెలిపారు. 'మంచి మదర్ సెంటిమెంట్తో వస్తున్న సినిమా. కథ బాగా వచ్చింది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డి.ఎస్.రాథోడ్కి థ్యాంక్స్' అని హీరో కృష్ణ చెప్పారు. గౌతమ్ రాజు మాట్లాడుతూ, 'మన తెలుగు సినిమా చరిత్రలో మదర్ సెంటిమెంట్తో వచ్చిన ప్రతి సినిమా హిట్. ఈ సినిమా కూడా మదర్ సెంటిమెంట్తో వచ్చే సినిమా. అంతేకాదు చాలా డిఫరెంట్ కథతో వస్తున్నారు. మంచి హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను' అని అన్నారు.