Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శర్వానంద్ నయా చిత్రం 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' సినిమా తిరుపతిలో ప్రారంభం అయ్యింది. ఇందులో కథానాయికగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన తొలిషాట్కి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ నివ్వగా, మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచాన్ చేశారు. అనగాని సత్యప్రసాద్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్ను మేకర్స్ కు అందజేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సి బ్యానర్లో నిర్మిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.