Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరిప్రియ మూవీస్ బ్యానర్ పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపు రమేష్ నిర్మాతగా, వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మరణ మృదంగం'. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ నుండి ఆరంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ కుంచపు రమేష్ మాట్లాడుతూ,'ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్కి జోడిగా 'పటాస్' ఫేమ్ శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇదొక మంచి కథ, శ్రీకాంత్కు బాగా సెట్ అయ్యే కథ ఇది. ఈ సినిమాతో శ్రీకాంత్కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాని తీస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా తీస్తున్నాం' అని చెప్పారు.