Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 2న తిరుపతిలో ప్రారంభమైన 'శ్రీకారం' చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్రీకరణలో సహకరించిన ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్కు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. 'శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిత్రీకరణ అనుకున్న షెడ్యూల్లో పూర్తి అయ్యింది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, నరేష్, రావు రమేష్, సాయి కుమార్, సత్య, సప్తగిరి, ఆమని ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. టాకీ పార్ట్తో పాటు దినేష్ మాస్టర్ నేతత్వంలో ఒక పాట చిత్రీకరణ కూడా జరిగింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. అలాగే శర్వానంద్ కెరీర్లో ది
బెస్ట్గా నిలిచే చిత్రమిది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి కిషోర్.బి దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. 'గద్దలకొండ గణేష్' తరువాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో వస్తోన్న రెండో సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తున్నారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావ్ రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్ట, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, డైరెక్టర్: కిషోర్.బి