Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూ దేవతలను తక్కువ చేస్తూ అవమాన పరుస్తున్నారని ముంబయికి చెందిన కర్ణిసేన 'లక్ష్మీబాంబ్' సినిమా టైటిల్పై తీవ్ర అభ్యంతం తెలుపుతూ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపింది. దీంతో గత కొద్ది రోజులుగా వివాదం ముదురుతూ రావడంతో సెంట్రల్ సెన్సార్ బోర్డ్ రంగంలోకి దిగి సమస్యని పరిష్కరించింది. అంతేకాకుండా 'లక్ష్మీబాంబ్'ని 'లక్ష్మీ' టైటిల్తో విడుదల చేసుకునే వెసులు బాటు కల్పిస్తూ అధికారిక ప్రకటన చేసింది. అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రమిది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ కానుంది.